ఎర్రగుంట్ల మండలంలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-29T10:21:17+05:30 IST

మండలంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రూరల్‌ పరిధి లో ఒకే రోజున చిలమకూరులో 7, పోట్లదుర్తిలో 2, నగరపంచాయతీ పరిధిలో ఒక కరోనా పాజిటివ్‌

ఎర్రగుంట్ల మండలంలో విజృంభిస్తున్న కరోనా

ఎర్రగుంట్ల, జూన్‌ 28: మండలంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రూరల్‌ పరిధి లో ఒకే రోజున చిలమకూరులో 7, పోట్లదుర్తిలో 2, నగరపంచాయతీ పరిధిలో ఒక కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎర్రగుంట్లలో 12కేసులు వచ్చిన తర్వాత కంటైన్‌మెంటు జోన్‌ను సరిగ్గా నెలరోజుల క్రితం తొలగించారు. నెల తర్వాత మళ్లీ ఎర్రగుంట్ల నగరపంచాతీ పరిధిలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో ఆ ఏరియాలో ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే చిలమకూరు మొత్తం కంటైన్‌మెంట్‌ జోన్లోకి వెళ్లింది. పోట్లదుర్తి, ఆర్టీపీపీలో కూడా పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌లోనే ఉంది. 

Updated Date - 2020-06-29T10:21:17+05:30 IST