అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి : బచ్చుల
ABN , First Publish Date - 2020-08-10T10:03:13+05:30 IST
విజయవాడ కొవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు.
మచిలీపట్నం టౌన్ : విజయవాడ కొవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. బందరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పదకొండు మంది కొవిడ్ బాధితులు అగ్నిప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమన్నారు. టీడీపీ నాయకలు ఏది మాట్లాడినా రాజకీయం చేస్తున్నారని అధికార వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారన్నారు. అగ్నిప్రమా దంలో చిక్కుకున్న బాధితులు హాహాకారాలు చేశారన్నారు. ప్రాణాలకు తెగించి ఫైర్ సిబ్బంది పాజిటివ్ కేసులని తెలిసినా రక్షించడం అభినం దనియమన్నారు.