హత్య కేసులో ముద్దాయిగా ఓ ఛానల్ రిపోర్టర్

ABN , First Publish Date - 2021-01-19T23:15:29+05:30 IST

జిల్లాలో సంచలనం సృష్టించిన కోవూర్ హత్య కేసులో ఓ ఛానల్ కు చెందిన

హత్య కేసులో ముద్దాయిగా ఓ ఛానల్ రిపోర్టర్

నెల్లూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన  కోవూర్ హత్య కేసులో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ ముద్దాయిగా ఉన్నట్టు తెలిసింది. మూడు రోజల క్రితం జిల్లాలోని కోవూర్ ఇనమడుగు సెంటర్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన సురేంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు తొందరగా అలర్ట్ అయి పట్టణంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. హత్యకు కారణమైన తొమ్మిది మంది వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్  చేసినట్టు తెలిసింది. పోలీసులు అరెస్ట్  చేసిన వ్యక్తులలో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ ఉన్నట్టు  తెలిసింది.


ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కాలనీలల్లో కనిపిస్తే పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొందని వారు తెలిపారు. 

Updated Date - 2021-01-19T23:15:29+05:30 IST