మన్యంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2020-05-23T08:36:41+05:30 IST

విశాఖ ఏజెన్సీలోనూ శనివారం 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా

మన్యంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

నేడు 40 డిగ్రీల వరకు ఉండే అవకాశం

చింతపల్లి శాస్త్రవేత్తలు వెల్లడి


చింతపల్లి: విశాఖ ఏజెన్సీలోనూ శనివారం 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ దేశగిరి శేఖర్‌ తెలిపారు. శుక్రవారం ఏజెన్సీ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈనెల 23న కనిష్ఠం 25.8 డిగ్రీలు, గరిష్ఠం ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలు, 24వ తేదీన కనిష్ఠం 26 డిగ్రీలు, గరిష్ఠం 38.3 డిగ్రీలు, 25న కనిష్ఠం 26, గరిష్ఠం 38 డిగ్రీలు, 26వ తేదీన కనిష్ఠం 26, గరిష్ఠం 38, 27వ తేదీన కనిష్ఠం 26.3 డిగ్రీలు, గరిష్ఠం 37.4 డిగ్రీలు, 11.2 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు.

Updated Date - 2020-05-23T08:36:41+05:30 IST