బాలుడికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-04-16T06:25:30+05:30 IST
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
ఆదోని రూరల్, ఏప్రిల్ 15: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వివరాల మేరకు.. శిరుగుప్ప తాలుకా శ్రీధరగడ్డకు చెందిన రమేష్, పెద్దకడబూరు మండలం ముచ్చిగేరిలో ఉన్న భార్య మహాదేవి, కొడుకు శివతో కలిసి కేఏ 23 ఈఏ 0811 బైక్పై సొంత ఊరికి వెళ్తుండగా పెట్రోల్ అయిపోయి పెద్దతుంబళం జైన్ టెంపుల్ వద్ద నిల్చున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తి కేఏ17ఈఎల్2353 వాహనంతో ఢీకొట్టడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. నిందితుడు ద్విచక్ర వాహనాన్ని వదిలి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు.