నాగావళి నదిలో బాలుడి గల్లంతు

ABN , First Publish Date - 2021-09-19T05:24:37+05:30 IST

నాగావళి నదిలో బాలుడి గల్లంతు

నాగావళి నదిలో బాలుడి గల్లంతు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 18: నాగావళి నదిలో స్నానానికి దిగిన బాలుడు గల్లంతయ్యాడు. శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధి సమీపంలో చోటుచేసుకుందీ ఘటన. ఇందుకు సంబంధించి ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దమ్మల వీధిలో మైలపల్లి రాజశేఖర్‌ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. శనివారం ఉదయం పాత్రునివలసలోని ఇంటి స్థలాన్ని చూసేందుకు రాజశేఖర్‌ భార్య వెళ్లింది. అదే సమయంలో వారి చిన్న కుమారుడు గణేష్‌ (7) నాగావళి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. స్థానికులు, విపత్తు నిర్వహణ సిబ్బంది గాలించినా ఆచూకీ లేకుండా పోయింది. శనివారం రాత్రి వరకూ గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు. తండ్రి రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

 

Updated Date - 2021-09-19T05:24:37+05:30 IST