లక్ష ఓట్లతో ఓడిస్తా... అఖిలేశ్కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్...
ABN , First Publish Date - 2021-12-01T19:34:53+05:30 IST
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్వాదీ
లక్నో : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను భారీ ఆధిక్యంతో ఓడిస్తానని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ శపథం చేశారు. అఖిలేశ్కు సత్తా ఉంటే బైరియా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన పోటీ చేస్తే తాను ఆయనను లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ విధంగా ఆయనను ఓడించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
సాగు చట్టాలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్పై సురేంద్ర సింగ్ విరుచుకుపడ్డారు. రాకేశ్ ఓ సీజన్డ్ పొలిటీషియన్ అని మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ప్రాపకంతోనే ఆయన రైతు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా బాలియా జిల్లాలో మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.