లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2020-02-20T10:37:44+05:30 IST

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు చాదరాసపల్లి

లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు

ఖమ్మంలీగల్‌, ఫిబ్రవరి 19: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు చాదరాసపల్లి రామారావు(23)కు 20ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.30,000లను జరిమాన విధిస్తూ ఖమ్మం ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కరరావు బుధవారం తీర్పుచెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి.. బాలిక కొణిజర్ల మండల నివాసి. 2019 ఏప్రిల్‌ 23వతేదీన మధ్యాహ్నం 12-30నిమిషాల ప్రాంతంలో నిందితుడు తన ఇంటికి బాలికనుతీసుకుని వెళ్లాడు.


అనంతరం కాసేపటికి బాలిక ఏడుపులు వినపడటంతో బాలిక తల్లి వెళ్లి చూడగా బాలిక శరీరంపై గాయాలవటంతో నిందితుడిని తల్లి ప్రశ్నించగా అతడు అక్కడనుండి పరారయ్యాడు. దీంతో బాలిక తల్లి కొణిజర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఐపీసీ 376(ఏబీ), పోస్కో చట్టం 2012సెక్షన్‌ కింద కేసునమోదు చేసి అరెస్టు చేసి నిందితుని విచారించి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో పై శిక్ష ఖరారు చేస్తూ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున ఏపీపీగా కొండపల్లి జగన్మోహన్‌రావు వాదించగా, లైజన్‌ ఆఫీసర్‌ పి.భాస్కరరావు, మల్లయ్య, మోహన్‌రావు, కోర్టు కానిస్టేబుల్‌ ఎ.మదార్‌, హోంగార్డు ఎండీ ఆయూబ్‌లు సహకరించారు.

Updated Date - 2020-02-20T10:37:44+05:30 IST