నృత్యం చేస్తుండగా చున్నీ బిగుసుకుపోయి..గుజరాత్‌లో 11 ఏళ్ల పాప మృతి

ABN , First Publish Date - 2021-06-23T09:15:30+05:30 IST

నృత్యం చేస్తూ దాన్నంతా సెల్ఫీ వీడియో తీయాలన్న ఉబలాటం ఆ 11 ఏళ్ల పాప ప్రాణాన్ని బలిగొంది. నర్తిస్తున్న పాప ఒక్కసారిగా పట్టుకోల్పోరుంది

నృత్యం చేస్తుండగా  చున్నీ బిగుసుకుపోయి..గుజరాత్‌లో 11 ఏళ్ల పాప మృతి

అహ్మదాబాద్‌, జూన్‌ 22: నృత్యం చేస్తూ దాన్నంతా సెల్ఫీ వీడియో తీయాలన్న ఉబలాటం ఆ 11 ఏళ్ల పాప ప్రాణాన్ని బలిగొంది. నర్తిస్తున్న పాప ఒక్కసారిగా పట్టుకోల్పోరుంది. పక్కనే కిటికీ చువ్వకు వేలాడుతున్న చున్నీకి ఆమె గొంతు బిగుసు కోవడంతో ఊపిరాడక మృతి చెందింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని మహిదార్‌పుర ప్రాంతంలో జరిగింది. నేపాల్‌కు చెందిన దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు పిల్లలను స్వదేశంలోనే ఉంచి.. మరో ఇద్దరు పిల్లలతో బతుకుదెరువు కోసం గుజరాత్‌కు వచ్చారు. ఇంట్లో పిల్లలను వదిలేసి భార్యాభర్తలిద్దరూ శనివారం పనికి వెళ్లారు. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూసే సరికి బాబు ఆడుకుంటుండగా పాప.. కిటికీ చువ్వలకు కట్టివున్న చున్నీకి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-06-23T09:15:30+05:30 IST