హంద్రీనీవా నీటికోసం 9న పాదయాత్ర: కాలవ

ABN , First Publish Date - 2022-07-07T06:13:11+05:30 IST

భైరవాన తిప్ప ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాలను అందించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు బుధవారం డిమాండ్‌ చేశారు.

హంద్రీనీవా నీటికోసం 9న పాదయాత్ర: కాలవ

గుమ్మఘట్ట, జూలై 6: భైరవాన తిప్ప ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాలను అందించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు బుధవారం డిమాండ్‌ చేశారు. నిధులు ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి నిరసనగా గుమ్మఘట్ట నుంచి బీటీపీ దాకా శనివారం పాదయాత్ర నిర్వహిస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది రైతు దినోత్సవం సందర్భంగా బీటీపీకి హంద్రీనీవా జలాలను తరలించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన, పట్టించుకోవడం లేదని అన్నారు. యాత్రకు ప్రజలందరూ తరలిరావాలని కోరారు.

Updated Date - 2022-07-07T06:13:11+05:30 IST