ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-10T22:48:53+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,82,843 పాజిటివ్ కేసులు చేరాయి. కరోనాతో 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,606 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 20,62,732 రికవరీ అయ్యారు. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని స్పష్టం చేశారు.