ప్రభుత్వ కొవిడ్ సెంటర్లలో 967 పడకల ఖాళీ
ABN , First Publish Date - 2021-05-07T06:53:56+05:30 IST
తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో గురువారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 967 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
తిరుపతి, మే 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో గురువారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 967 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. తిరుచానూరులోని పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్లో ఖాళీలు లేవు. విష్ణు నివాసంలో 230, శ్రీనివాసంలో 440, రుయాలో 194 (ఆక్సిజన్ 8, నాన్ ఆక్సిజన్ 186), ఆయుర్వేద వైద్యశాలలో 6, ఈఎస్ఐ ఆస్పత్రిలో 30 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 67 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.