960 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-06T10:51:43+05:30 IST

కర్ణాటక నుంచి వైఎస్‌ఆర్‌ కడపజిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం ప్యాకెట్లను ముదిగుబ్బ..

960 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం

ముదిగుబ్బ, జూలై 5: కర్ణాటక నుంచి వైఎస్‌ఆర్‌ కడపజిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం ప్యాకెట్లను ముదిగుబ్బ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం కదిరి డీఎస్పీ లాల్‌ అహమ్మద్‌, నల్లమాడ సీఐ నరసింహరావు, ఎస్‌ఐ శ్రీనివాసులు వెల్ల డించారు. ఎస్పీ సత్యయేసుబాబు అక్రమమద్యంను నివారించాలని ఆదేశాలు ఇవ్వడంతో శనివారం సాయంత్రం స్థానిక బుక్కపట్నం రోడ్డులోని పాతవూరు గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. లింగాలకు చెందిన రజాక్‌, రమేశ్‌బాబు  బొ లెరో వాహనంలో మద్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. వీరు 20 అట్ట పెట్టెలలో తరలిస్తున్న 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అలాగే బొలేరో వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. 

Updated Date - 2020-07-06T10:51:43+05:30 IST