ఏపీలో 94% వ్యాక్సినేషన్ పూర్తి: మంత్రి అదిమూలపు
ABN , First Publish Date - 2021-09-01T00:48:30+05:30 IST
ఏపీలో 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.
అమరావతి: ఏపీలో 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విశాఖలో100 శాతం , కడపలో 99 శాతం, విజయనగరం, చిత్తూరు, నెల్లూరులో 98 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 86 శాతం అయినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.