ఏపీలో 94 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-15T21:47:03+05:30 IST

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 94 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,85,710కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒక్కరు మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,139 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,199 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని రాష్ట్రవ్యాప్తంగా 8,76,372 మంది రికవరీ అయ్యారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శానిటైజర్, మాస్కులు విధిగా వాడాలని డాక్టర్లు తెలిపారు. 

 తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2,91,118 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1574 మంది మృతి చెందారు. తెలంగాణలో 4,442 యాక్టివ్ కేసులున్నాయి. 2,85,102 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


Updated Date - 2021-01-15T21:47:03+05:30 IST