కోజికోడ్ విమాన ప్రమాదం.. 92 మంది ప్రయాణికుల డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-08-13T22:19:19+05:30 IST

కోజికోడ్ విమాన ప్రమాదంలో గాయపడిన 92 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఎయిర్ ఇండియా

కోజికోడ్ విమాన ప్రమాదం.. 92 మంది ప్రయాణికుల డిశ్చార్జ్

న్యూఢిల్లీ: కోజికోడ్ విమాన ప్రమాదంలో గాయపడిన 92 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఎయిర్ ఇండియా గురువారం తెలిపింది. వారంతా పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని పేర్కొంది. కోజికోడ్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఏడుగురు ప్రయాణికులు బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య డిశ్చార్జ్ అయినట్టు వివరించింది. నిన్నటికి మొత్తం 85 మంది ప్రయాణికులు డిశ్చార్జ్ కాగా, మిగతా ఏడుగురు గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. 


ఈ నెల 7న 190 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతూ రన్‌వే పైనుంచి పక్కకు జారి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.  


Updated Date - 2020-08-13T22:19:19+05:30 IST