పోలీసు స్పందనకు 91 వినతులు
ABN , First Publish Date - 2021-07-27T06:30:29+05:30 IST
స్పందనలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ మలిక గర్గ్ ఆదేశించారు.
ఒంగోలు(క్రైం), జూలై 26 : స్పందనలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ మలిక గర్గ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలు మూలల నుంచి 91 వినతులు వచ్చాయి. ఎక్కువ మంది కుటుంబ కలహాలు, వేధింపులు, ఆన్లైన్ మోసాలులాంటి సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఏఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్డీచౌడేశ్వరి, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు పాల్గొన్నారు.