ఢిల్లీలోని 90 శాతం టీనేజర్లకు మొదటి డోస్ పూర్తి

ABN , First Publish Date - 2022-02-27T21:34:30+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 90 శాతం మంది టీనేజర్లకు మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తైందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ప్రకటించింది. గత జనవరి 3న టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.

ఢిల్లీలోని 90 శాతం టీనేజర్లకు మొదటి డోస్ పూర్తి

దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 90 శాతం మంది టీనేజర్లకు మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తైందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ప్రకటించింది. 15 నుంచి 18 ఏళ్లలోపు వయసుగల వారిలో గత గురువారం నాటికి 90 శాతం మంది మొదటి డోసు తీసుకోగా, వారిలో కనీసం 54 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నట్లు డీడీఎమ్ఏ వెల్లడించింది. డీడీఎమ్ఏ నివేదిక ప్రకారం..  ఢిల్లీ పరిధిలో మొత్తం 9.13 లక్షల మంది టీనేజర్లు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, 5.44 లక్షల మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గత జనవరి 3న టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ఢిల్లీలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో పాఠశాలలు నడవబోతున్నాయి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభం కాలేదు. కరోనా నిబంధనల మధ్యే స్కూళ్లు తెరుచుకున్నాయి. 

Updated Date - 2022-02-27T21:34:30+05:30 IST