వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ప్రియుడిపై ఆగ్రహం.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-09-22T01:40:16+05:30 IST

ఆ మహిళ వివాహిత.. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా.. భర్త ఉండగానే ఆమె తన కంటే 9 ఏళ్లు చిన్న వాడైన

వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ప్రియుడిపై ఆగ్రహం.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఆ మహిళ వివాహిత.. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా.. భర్త ఉండగానే ఆమె తన కంటే 9 ఏళ్లు చిన్న వాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్త మందలించినా ఆమెలో మార్పు రాలేదు.. అంతేకాదు యుక్త వయసులో ఉన్న తన ప్రియుడు వేరే అమ్మాయిలతో మాట్లాడితే సహించేది కాదు.. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఆ ఇద్దరి మధ్య వేరే అమ్మాయి గురించి వాగ్వాదం జరిగింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు ఆ మహిళను కత్తితో పొడిచి చంపేశాడు. 


ఇది కూడా చదవండి..

Rajasthan: చోరీ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులకు పట్టించిన కారు డ్రైవర్.. అతడు ఎలా ప్లాన్ చేశాడంటే..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని నర్మదాపురంకు చెందిన వివాహిత (31) హత్య కేసులో ఆమె ప్రియుడిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. హత్యకు గురైన మహిళకు ముగ్గురు పిల్లలు. ఆమె తన కంటే 9 ఏళ్లు చిన్నవాడైన సంజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. మూడు రోజుల క్రితం సంజయ్ విషయమై ఆ మహిళకు భర్తతో గొడవ జరిగింది. కోపంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా, సంజయ్ వేరే అమ్మయిలతో మాట్లాడితే ఆ మహిళ తట్టుకోలేకపోయేది. అతడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేది. 


మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంటికి సంజయ్ వెళ్లాడు. రాత్రి సమయంలో వేరే అమ్మాయి విషయమై ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సంజయ్ ఆ మహిళ తల, పొత్తి కడుపుపై ​​కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి ఇంటికి నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-09-22T01:40:16+05:30 IST