పాక్లో దారుణం.. అత్తను కాల్చి చంపిన తొమ్మిదేళ్ల మేనల్లుడు..
ABN , First Publish Date - 2020-09-24T06:08:52+05:30 IST
పాకిస్థాన్లో తొమ్మిదేళ్ల బాలుడు ఓ మహిళను తుపాకీతో కాల్చి చంపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
లాహోర్: పాకిస్థాన్లో తొమ్మిదేళ్ల బాలుడు ఓ మహిళను తుపాకీతో కాల్చి చంపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ల బాధితురాలు మంగళవారం సర్గోదా అనే ప్రాంతంలో ఓ వేడుకకు హాజరైంది. ఇదే వేడుకకు తొమ్మిదేళ్ల వయసున్న ఆమె మేనల్లుడు కూడా తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. వేడుక జరుగుతుండగా బాలుడు తుపాకీని బయటకు తీసి తన అత్తపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఇక సంఘటన స్థలం నుంచి బాలుడిని తీసుకుని అతడి కుటుంబసభ్యులు వెంటనే తప్పించుకున్నారు. కుటుంబసభ్యులే తన అత్తను చంపమంటూ నిందితుడైన బాలుడికి ట్రైనింగ్ ఇచ్చినట్టు పోలీసులు తెలుసుకున్నారు. బాలుడి తండ్రితో పాటు ఇతర కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు పదేళ్ల క్రితం కుటుంబసభ్యులకు ఇష్టం లేని వివాహం చేసుకుందని.. ఈ కోపంతోనే ఆమెను బాలుడి చేత కుటుంబసభ్యులు హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.