11మంది కరోనా పేషెంట్లలో 9 మందిని డిశ్చార్జ్ చేశాం: సీఎం
ABN , First Publish Date - 2020-04-10T00:48:24+05:30 IST
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందని ఛత్తీస్ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదయ్యాయని, అయితే వారిలో 9 మంది పూర్తిగా...
నయారాయ్పూర్: రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందని ఛత్తీస్ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదయ్యాయని, అయితే వారిలో 9 మంది పూర్తిగా కోలుకున్నారని, దాంతో వారిని గురువారం డిశ్చార్జ్ చేశామని ఆయన వెల్లడించారు. మరో పేషెంట్ను కూడా త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. అయితే మిగిలిన ఒక్క కరోనా పాజిటివ్ కేసు బుధవారం రాత్రి గుర్తించామని, అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి ఆ ప్రాంతాన్నంతా లాక్డౌన్ చేశామని సీఎం భూపేష్ వివరించారు. అతడికి కరోనా సోకడానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు.