కరోనా సహాయ నిధికి రూ.9లక్షల విరాళాలు
ABN , First Publish Date - 2020-03-31T10:11:14+05:30 IST
కరోనా వైరస్ మహమ్మానిని ఎదుర్కొనేందుకు జిల్లా సహాయ నిధికి రూ.9లక్షలు దాతలు వి రాళాలు
కడప(కలెక్టరేట్) మార్చి 30 : కరోనా వైరస్ మహమ్మానిని ఎదుర్కొనేందుకు జిల్లా సహాయ నిధికి రూ.9లక్షలు దాతలు వి రాళాలు ఇచ్చినట్లు కలెక్టర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కడప జిల్లా రైస్ మర్చంట్స్ అసోసియేషన్ రూ.5లక్షలు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రూ.2లక్షలు, సిండ్కేట్ బ్యాంకు ఉద్యోగులు రూ.1లక్ష, కో-ఆపరేటివ్ కాలనీ నివాసి సాంఘిక సం క్షేమ శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్న శ్యాం సుందర్ రెడ్డిరూ.1లక్ష మొత్తం కలిపి రూ.9 లక్షలు విరాళాలు అందినట్లు కలెక్టర్ తెలి పారు.
కాగా ప్రకాష్నగర్లో నిరు పేదలకు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసులు, ఎన్ఎస్యూఐ నేత తిరుమలేశులు నిత్యావసర సరుకులను వితరణ చేశారు. మారుతీనగర్లో కాంగ్రెస్ రాష్ట్ర నేత బండి జకరయ్య నిత్యవసర సరుకులు అందజేశారు. సంపాదన లేని కుటుంబాలకు రూ.5 వేలు ప్రతినెలా అం దించాలని డిమాండ్ చేశారు.