కరోనా చికిత్స అనంతరం సైడ్‌ఎఫెక్ట్స్... 10 మందిలో 9 మందికి సమస్యలు!

ABN , First Publish Date - 2020-09-30T16:54:24+05:30 IST

ప్రపంచం కరోనా వైరస్‌తో అల్లాడిపోతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారినపడి, చికిత్స పొందాక కోలుకున్నారు. వీరిలో కొంతమందిపై ఈ వ్యాధి దుష్ప్రభావాలు...

కరోనా చికిత్స అనంతరం సైడ్‌ఎఫెక్ట్స్... 10 మందిలో 9 మందికి సమస్యలు!

న్యూఢిల్లీ: ప్రపంచం కరోనా వైరస్‌తో అల్లాడిపోతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారినపడి, చికిత్స పొందాక కోలుకున్నారు. వీరిలో కొంతమందిపై ఈ వ్యాధి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాలో నిర్వహించిన ఒక ప్రాథమిక అధ్యయనాన్ని అనుసరించి, 10 కోట్ల మంది కరోనా బాధితులలో 9 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నాక కూడా అలసట, మానసిక అలజడి, వాసన, రుచి కోల్పోవడం లాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తేలింది. కరోనా నుంచి కోలుకున్న 965 మందిని పరిగణలోకి తీసుకుని, ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా 879 మంది(91.1 శాతం) తాము తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని తెలిపారు. 


కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీఎస్) అధికారి నౌన్ జన్ వూక్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న 26.2 శాతం మందిలో అలసట, ఏకాగ్రత లోపించడంలాంటి లక్షణాలు కనిపించాయన్నారు. 24.6 శాతం మంది తాము దేనిపై కూడా తగినంత దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు. ఇదేవిధంగా మరికొంతమందిలో మానసిక అలజడి, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కిమ్ షిన్-వూ క్యూంగ్పుక్ నేషనల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ కు చెందిన వైద్య నిపుణులు దక్షిణకొరియాలోని 5,762 మంది బాధితుల నుంచి ఈ వివరాలు కోరారని అన్నారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగిందని, త్వరలోనే ఈ వివరాలపై వైద్య పరిశోధకులు మరింతగా విశ్లేషణ చేయనున్నారని తెలిపారు. 


Updated Date - 2020-09-30T16:54:24+05:30 IST