8న మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
ABN , First Publish Date - 2021-02-25T06:36:12+05:30 IST
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుర ష్కరించుకుని రాజమహేంద్రవరంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని నగర మహిళా ఎన్జీవో సంఘం అధ్యక్షురాలు పి.మంగతాయారు తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 24: మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుర ష్కరించుకుని రాజమహేంద్రవరంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని నగర మహిళా ఎన్జీవో సంఘం అధ్యక్షురాలు పి.మంగతాయారు తెలిపారు. స్థానిక ఎన్జీవో హోమ్లో బుఽధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా ఉద్యోగిణులకు వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలను మహిళా ఉద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావునాయుడు, ప్రవీణ్కుమార్, సహ అధ్యక్షులు వేణుమాధవరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.