తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-30T01:17:10+05:30 IST

తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే ...

తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే 874 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 874 కరోనా కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. 765 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20, 246కు చేరింది. 154 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 11,313 మంది  కోలుకుని డిశ్చార్జ్ కాగా 8,776 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-30T01:17:10+05:30 IST