తెలంగాణలో కరోనా మరణాల కలవరం.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-03T03:51:51+05:30 IST

తెలంగాణలో మంగళవారం కొత్తగా 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు...

తెలంగాణలో కరోనా మరణాల కలవరం.. ఇవాళ ఒక్కరోజే..

హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,891కి చేరింది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే నలుగురు కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య  92కి చేరింది. ఇవాళ నమోదైన 87 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 70 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది.


రంగారెడ్డి 7, మేడ్చల్‌ 3, నల్గొండలో 2, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డిలో ఒక్కో కేసు నమోదయినట్లు హెల్త్ బులిటెన్‌లో వివరించింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,273. ఇప్పటివరకూ కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 1,526 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరో 12 మంది వలసకూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిపింది.

Updated Date - 2020-06-03T03:51:51+05:30 IST