కరోనా తాజా లెక్క.. ఆ 6 రాష్ట్రాల్లోనే 86శాతం కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-02-28T01:34:55+05:30 IST

దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్ర కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను ..

కరోనా తాజా లెక్క.. ఆ 6 రాష్ట్రాల్లోనే 86శాతం కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్ర కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం 6 రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 85.75 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్రలో అత్యధికంగా 8,333 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేరళలో 3,671 కేసులు, పంజాబ్‌లో 622 కేసులు, కర్ణాటకలో 571, తమిళనాడులో 481, గుజరాత్‌లో 460 కేసులు నమొదయ్యాయి. మొత్తంగా 16,488 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.



Updated Date - 2021-02-28T01:34:55+05:30 IST