పాలిసెట్‌కు 81.06 హాజరు

ABN , First Publish Date - 2020-09-28T10:24:07+05:30 IST

రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జరిగిన ’పాలిసెట్‌-2020’ ప్రవేశపరీక్షకు 71,589

పాలిసెట్‌కు 81.06 హాజరు

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జరిగిన ’పాలిసెట్‌-2020’ ప్రవేశపరీక్షకు 71,589 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 388 కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశపరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి నిర్వహించింది. పాలిసెట్‌ ప్రవేశపరీక్షకు 88,314మంది విద్యార్థులు నమోదు చేసుకుకోగా, 81.06ు మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాల అధికార యంత్రాంగం సహకారంతో పరీక్ష సజావుగా జరిగాయని ఎస్‌బీటీఈటీ స్పెషల్‌ కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నాపత్రం ’కీ’ని ఈ నెల 29న ఎస్‌బీటీఈటీఏపీ.జీవోవీ.ఐఎన్‌వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు.అక్టోబరు5వ తేదీలోగా ఫలితాలు విడుదలకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Updated Date - 2020-09-28T10:24:07+05:30 IST