80 ఏళ్ల వృద్ధురాలిపై బలాత్కారం.. మందుకొట్టి బంధువే..

ABN , First Publish Date - 2021-08-04T08:30:28+05:30 IST

దేశంలో రానురాను మహిళలకు కనీస భద్రత కూడా లేకుండా పోతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ..

80 ఏళ్ల వృద్ధురాలిపై బలాత్కారం.. మందుకొట్టి బంధువే..

లక్నో: దేశంలో రానురాను మహిళలకు కనీస భద్రత కూడా లేకుండా పోతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఘటన స్థానిక బుదైన్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. బాధిత వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.


కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత వృద్ధురాలికి సమీప బంధువైన నిందితుడు.. రాత్రి భోజనం(డిన్నర్) సాకుతో ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె అక్కడకు చేరుకునే సమయానికే నిందితుడు ఫూటుగా మందుకొట్టి నిషాలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వృద్ధురాలిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణం తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. అయితే విషయం తెలుసుకున్న ఇతర బంధువులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.


అయితే వృద్ధురాలు చెబుతున్న మాటలను మొదట పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వృద్ధురాలు ఈ ఆరోపణలు చేస్తున్నారేమో అని భావించారు. కానీ ప్రాథమిక దర్యాప్తు అనంతరం బలాత్కారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కూడా తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-04T08:30:28+05:30 IST