రాజ్యసభ నిధుల్లో 80 కోట్లు ఆదా: వెంకయ్య
ABN , First Publish Date - 2020-05-05T06:52:50+05:30 IST
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు లాక్డౌన్ తర్వాతే నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. రాజ్యసభ ఉన్నతాధికారులతో సోమవారం...
న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు లాక్డౌన్ తర్వాతే నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. రాజ్యసభ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. లాక్డౌన్ విధించిన తర్వాత రాజ్యసభ అధికారులతో ఆయన సమావేశమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్టాండిం గ్ కమిటీ భేటీలపై మే 17న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణ యం తీసుకుందామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది రాజ్యసభకు కేటాయించిన నిధుల్లో కనీ సం రూ. 80 కోట్లు ఆదా చేయాలని ఆయన లక్ష్యం విధించారు.