ఎన్నికల శిక్షణ తరగతులకు 80 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2021-04-14T06:46:41+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి సోమవారం తిరుపతిలో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు 80 మంది పీవో, ఏపీవోలు గైర్హాజరయ్యారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ హరినారాయణన్‌ గైర్జారైన వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల శిక్షణ తరగతులకు 80 మంది గైర్హాజరు

షోకాజ్‌ నోటీసులు జారీ


చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 13: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి సోమవారం తిరుపతిలో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు 80 మంది పీవో, ఏపీవోలు గైర్హాజరయ్యారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ హరినారాయణన్‌ గైర్జారైన వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సోమవారం గైర్హాజరైన సిబ్బంది కోసం బుధవారం మరోసారి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. అక్కడి ఏఆర్‌వోలను వీరు కలిసి సంజాయిషి ఇచ్చుకుని శిక్షణా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. బుధవారం కూడా గైర్హాజరైతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.

Updated Date - 2021-04-14T06:46:41+05:30 IST