ఎనిమిదేళ్ల బాలిక.. 80ఏళ్ల వృద్ధాప్యంలో మరణం..!
ABN , First Publish Date - 2020-02-16T23:24:28+05:30 IST
ఎనిమిదేళ్ల బాలిక.. 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించిన ఘటన ఉక్రెయిన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నా సాకిడాన్(8) , ప్రొగేరియా అనే జన్యు
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల బాలిక.. 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించిన ఘటన ఉక్రెయిన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నా సాకిడాన్(8) , ప్రొగేరియా అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి వయసు వాస్తవానికి ఎనిదేళ్లే అయినా.. వ్యాధి కారణంగా ఆమె బయోలాజికల్ వయసు 80ఏళ్లుగా ఉంది. దీంతో పాప ఒంట్లోని కొన్ని అవయవాలు పని చేయకపోవడంతో తుదిశ్వాస విడిచింది. కాగా.. తమ పాప గత నెలలోనే 8వ వసంతంలోకి అడుగుపెట్టినట్లు అన్నా సాకిడాన్ తల్లిదండ్రులు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే ఈ అరుదైన వ్యాధితో బాధపడే వారు ప్రపంచ వ్యాప్తంగా 160 మంది మాత్రమే ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.