రిమ్స్లో 8 అనుమానిత కేసులు
ABN , First Publish Date - 2020-03-29T10:18:28+05:30 IST
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం ఒకే కుటుంబం నుంచి ఐదుగురు, వివిధ ప్రాంతాల నుంచి ముగ్గురు
కడప (సెవెన్రోడ్స్), మార్చి 28: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం ఒకే కుటుంబం నుంచి ఐదుగురు, వివిధ ప్రాంతాల నుంచి ముగ్గురు కరోనా అనుమానితులు చేరినట్లు రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కొండయ్య తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన కుటుంబ సభ్యులు ఐదుగురు, కమలాపురానికి చెందిన ఒక వ్యక్తి, మైదుకూరుకు చెందిన ఒక వ్యక్తి, కడపకు చెందిన మరో వ్యక్తిగా ఆర్ఎంవో తెలిపారు. శనివారం వరకు ఉన్న అన్ని అనుమానితుల రిపోర్టులు నెగటివ్గా వచ్చాయన్నారు.