8 లక్షల మంది భారతీయులు ఇంటికేనా?
ABN , First Publish Date - 2020-07-06T08:22:09+05:30 IST
ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధమేనని కువైత్ జాతీయ అసెంబ్లీలోని లీగల్, లెజిస్లేటివ్ కమిటీ నిర్ణయించింది. సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి బిల్లును మరొక కమిటీకి అప్పగించింది...
- ప్రవాసీ కోటా బిల్లు రాజ్యాంగబద్ధమే: కువైత్ అసెంబ్లీ కమిటీ
కువైత్, జూలై 5: ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధమేనని కువైత్ జాతీయ అసెంబ్లీలోని లీగల్, లెజిస్లేటివ్ కమిటీ నిర్ణయించింది. సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి బిల్లును మరొక కమిటీకి అప్పగించింది. ఈ బిల్లు ప్రకారం.. కువైత్ జనాభాలో భారతీయులు 15శాతం మించకూడదు. ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు 14లక్షల 50వేల మంది భారతీయులు ఉన్నారు. బిల్లు ఆమోదిస్తే దాదాపు 8లక్షల మందిని బలవంతంగా స్వదేశానికి పంపేస్తారు. 43లక్షల మంది కువైత్ జనాభాలో 30లక్షల మంది వలసదారులే ఉండడం గమనార్హం.