తల్లి చనిపోయిందని తెలియక ఆమె గుండెల మీదే నిద్రపోయిన ఏడేళ్ల కూతురు.. పొద్దున్నే పనిమీద మేనమామ వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-21T21:29:26+05:30 IST

తల్లి చనిపోయిందనే విషయం

తల్లి చనిపోయిందని తెలియక ఆమె గుండెల మీదే నిద్రపోయిన ఏడేళ్ల కూతురు.. పొద్దున్నే పనిమీద మేనమామ వచ్చి చూస్తే..

ఆ మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపాడు.. తల్లి చనిపోయిందనే విషయం తెలుసుకోలేని ఏడేళ్ల బాలిక ఆమెపై పడుకుని రాత్రంతా నిద్రపోయింది.. ఉదయం ఇంటికి వచ్చిన హతురాలి సోదరుడు అసలు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.. ఆ మహిళ మాజీ భర్తపై, ఆమె పక్కింట్లో ఉండే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇది కూడా చదవండి..

మైనర్ బాలికను ట్రాప్ చేసి అత్యాచారం.. చివరకు విషయం ఎంత దూరం వెళ్లిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సైమా (30)కు 2014లో షాజాద్‌తో వివాహమైంది. ఏడాది క్రితం ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ మహిళకు లైరా అనే 7 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా ఆ మహిళ తన తల్లి సైరాతో కలిసి శ్యామ్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం మహిళ తల్లి వేరే ఊరు వెళ్లింది. మంగళవారం ఉదయం సైమా సోదరుడు ఇంటికి వచ్చే చూసే సరికి ఆమె చనిపోయి ఉంది. ఆమె మృతదేహంపై ఏడేళ్ల కూతురు నిద్రపోతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతురాలి తలలో బుల్లెట్ దిగి ఉంది. 


సైమా పక్కింట్లో బబ్లూ అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. మంగళవారం తెల్లవారుజామున 4.30 వరకు బబ్లూ తన గదిలోనే ఉన్నాడు. ఉదయం చూసేసరికి ఆ ఇంట్లో బబ్లూ, అతని వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులు బబ్లూను అనుమానితుడిగా పరిగణిస్తున్నారు. అలాగే ఆ మహిళ మొదటి భర్తను కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బబ్లూ గురించి అన్వేషణ సాగిస్తున్నారు. 



Updated Date - 2022-06-21T21:29:26+05:30 IST