రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

ABN , First Publish Date - 2022-10-03T09:16:09+05:30 IST

దసరా ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 2: దసరా ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దాదాపు 11.27 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. దసరా ముందే బోనస్‌ చెల్లించనున్నట్టు పేర్కొంది. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు మొత్తం రూ.1832.09 కోట్లు బోన్‌సగా చెల్లించనుంది. ఆర్పీఎఫ్‌, ఆర్పీఎ్‌సఎఫ్‌ సిబ్బందికి బోనస్‌ వర్తించదు.  

Updated Date - 2022-10-03T09:16:09+05:30 IST