76 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-10-19T10:22:03+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 76మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిం ది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బెలెటిన్‌ విడుదల చేసింది.

76 మందికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 18(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొత్తగా మరో 76మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిం ది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బెలెటిన్‌ విడుదల చేసింది. ఆదివారం స్థానికుల సమాచారం మేరకు జిల్లాల్లో దాదాపు 120 మంది వరకు కరోనా సోకినట్లు తెలిసింది. కరీంనగర్‌ పట్టణానికి చెందిన 56 సంవత్సరాల మహిళకు గత నెల 25న కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతిచెందారు. హుజురాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మి కుంట మండలంలో నలుగురికి, హుజురాబాద్‌ మండలంలో ఐదుగురికి,  శంకరపట్నంలో ఒకరికి,   ఇల్లందకుంట మం డలంలో ఒకరికి కరోనా వ్యాధిసోకింది. అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ మండలంలో ఒకరికి, మానకొండూర్‌ మండలంలో నలుగురికి, చొప్పదండిలో ఐదుగురికి, రామడుగులో ఇద్దరికి, గంగాధర మండలంలో ముగ్గురికి,  చిగురుమామిడి మండలం లో ఒకరికి, కరీంన గర్‌ రూరల్‌ మండలంలో ఒకరికి, కొత్తపల్లి మండలంలో ముగ్గురికి  వైరస్‌ సోకింది. కరీంనగర్‌ పట్టణంలోని తిరు మల్‌నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌లో ఒకరు, భగత్‌నగర్‌లో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు, మారుతీనగర్‌లో ఇద్దరు, శ్రీనగర్‌కాలనీలో ముగ్గురు, హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇద్దరు, బ్యాంకు కాలనీలో ఒకరు, వావిలాలపల్లిలో ఒకరు వ్యాధిబారిన పడ్డారు.  

Updated Date - 2020-10-19T10:22:03+05:30 IST