తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన 75 మంది విదేశీయులకు బెయిలు

ABN , First Publish Date - 2020-07-12T00:58:03+05:30 IST

ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 75 మంది థాయిలాండ్, నేపాల్ వాసులకు ఢిల్లీ కోర్టు శనివారం

తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన 75 మంది విదేశీయులకు బెయిలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 75 మంది థాయిలాండ్, నేపాల్ వాసులకు ఢిల్లీ కోర్టు శనివారం బెయిలు మంజూరు చేసింది. వీసా నిబంధనలు ఉల్లంఘించి తబ్లిగి కార్యక్రమానికి హాజరైన వీరిపై చార్జిషీట్ దాఖలైంది. కొవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘించడంతోపాటు మిషనరీ కార్యకలాపాలను చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్టు వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. శనివారం వీరికి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గుర‌మోహిన కౌర్ ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 33 దేశాలకు చెందిన 445 మంది విదేశీయులకు బెయిలు లభించింది. పోలీసులు గత నెలలో 36 దేశాలకు చెందిన 956 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేశారు. 

Updated Date - 2020-07-12T00:58:03+05:30 IST