హాకీ ఇండియా మరో రూ.75 లక్షలు..

ABN , First Publish Date - 2020-04-05T09:46:29+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి విరాళం ప్రకటించింది. తాజాగా పీఎం-కేర్స్‌ నిధికి రూ.75 లక్షల విరాళమిచ్చింది...

హాకీ ఇండియా మరో రూ.75 లక్షలు..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి విరాళం ప్రకటించింది. తాజాగా పీఎం-కేర్స్‌ నిధికి రూ.75 లక్షల విరాళమిచ్చింది. దీంతో హెచ్‌ఐ అందించిన మొత్తం రూ.కోటికి చేరింది. ఈనెల 1న ముందుగా హెచ్‌ఐ రూ.25 లక్షల విరాళం ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిర్ణయం మేరకు ఈ అదనపు మొత్తాన్ని అందించినట్టు హెచ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపాడు. ఈ కష్టకాలంలో దేశానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పాడు. అలాగే గోల్ఫర్‌ అనిర్బన్‌ లహిరి రూ.7 లక్షల విరాళమిచ్చాడు. దేశానికి సహాయం చేసేందుకు ఎంత మొత్తమైనా అందజేసి తమ వంతు పాత్ర పోషించాలని కోరాడు. 

Updated Date - 2020-04-05T09:46:29+05:30 IST