కడప: కరోనా వారియర్స్ను సన్మానించిన మంత్రులు
ABN , First Publish Date - 2020-08-15T15:14:04+05:30 IST
కడప: నగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
కడప: నగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్చార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాష... జాతీయ జండాను ఎగురవేసి.. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సురేష్ సందేశం వినిపించారు. కరోనాపై యుద్ధంలో కీలక పాత్ర పోషించిన కరోనా వారియర్స్, మునిసిపల్ కార్మికులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.