తమిళనాడులో మరో 74 కరోనా కేసులు.. 73 మంది మర్కజ్‌కు వెళ్లినవారే!

ABN , First Publish Date - 2020-04-05T01:48:54+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారిని చాలావరకు నియంత్రించామని సంబరపడిన ప్రభుత్వాలకు మార్చి నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం చేదు అనుభవాన్నే మిగిల్చింది.

తమిళనాడులో మరో 74 కరోనా కేసులు.. 73 మంది మర్కజ్‌కు వెళ్లినవారే!

చెన్నై: దేశంలో కరోనా మహమ్మారిని చాలావరకు నియంత్రించామని సంబరపడిన ప్రభుత్వాలకు మార్చి నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఎందుకంటే నిజాముద్దీన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలామందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో నమోదైన ప్రతి మూడు కరోనా కేసుల్లో ఒకరు ఈ కార్యక్రమానికి వెళ్లొచ్చారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతోనే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. దీనికి మరో ఉదాహరణ తమిళనాడు ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన. తమ రాష్ట్రంలో మరో 74 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రెటరీ బీలా రాజేశ్ ప్రకటించారు. అయితే వీరిలో 73మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారేనట. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 485కు చేరిందని, వీటిలో 437 కేసులకు తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంతో సంబంధాలున్నాయని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-04-05T01:48:54+05:30 IST