729 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-06T06:34:39+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల వేగం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 729 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం

729 పాజిటివ్‌ కేసులు

11,074కు చేరిన బాధితులు

ముగ్గురు మృతి


కడప, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కేసుల వేగం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 729 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,074కు చేరుకుంది. కరోనాతో ముగ్గురు మృతి చెందినట్లు వెల్లడించింది. మృతుల సంఖ్య 121కి చేరుకుంది. ఫాతిమా, రిమ్స్‌ కొవిడ్‌ సెంటర్లలో చికిత్స పొంది కోలుకున్న 303 మందిని డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5070 మంది కోలుకున్నారన్నారు.

Updated Date - 2020-08-06T06:34:39+05:30 IST