Himachal Pradesh: గోవింద్ సాగర్ సరస్సులో ఏడుగురు టూరిస్టుల జాడ గల్లంతు
ABN , First Publish Date - 2022-08-01T23:36:03+05:30 IST
హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఏడుగురు పర్యటకుల జాడ గల్లంతైంది. బాబా గరీబ్నాథ్ ఆలయం సమీపంలోని..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో ఏడుగురు పర్యాటకుల జాడ గల్లంతైంది. బాబా గరీబ్నాథ్ ఆలయం సమీపంలోని గోవింద్ సాగర్ సరస్సులో వీరు గల్లంతైనట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా పంజాబ్కు చెందిన పర్యాటకులని, ఈ గ్రూపులో 11 మంది టూరిస్టులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు, సహాయక సిబ్బంది ఇక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుంటున్నట్టు ఉనా ఎస్పీ ఆర్జీత్ సేన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.