కొవిడ్ - 19: గల్ఫ్ దేశాల్లో ఒక్కరోజే ఏడుగురు భారతీయులు మృతి

ABN , First Publish Date - 2020-05-27T02:36:21+05:30 IST

కొవిడ్-19 కారణంగా మంగళవారం ఒక్క రోజే గల్ఫ్ దేశాల్లో ఏడుగురు భారతీయులు

కొవిడ్ - 19: గల్ఫ్ దేశాల్లో ఒక్కరోజే ఏడుగురు భారతీయులు మృతి

రియాద్: కొవిడ్-19 కారణంగా మంగళవారం ఒక్క రోజే గల్ఫ్ దేశాల్లో ఏడుగురు భారతీయులు మరణించారు. ఈ ఏడుగురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారేనని అధికారులు తెలిపారు. రియాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తూ వచ్చిన అబ్దుస్సలామ్(44) అనే వ్యక్తి సులేమాన్ హబీబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అబ్దుస్సలామ్ అంతకుముందు నుంచే కిడ్నీల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కువైట్‌లో కేరళకు చెందిన అజయన్ అనే మరో భారతీయుడు మంగళవారం చనిపోయాడు. కరోనా పాజిటివ్ అని తెలిసిన ఆరు రోజులకే అజయమ్ మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. మరోపక్క దోహలో సెయితలీ కుట్టీ(69) అనే మహిళ మరణించింది. అబూధాబీలో గత రెండు వారాల నుంచి చికిత్స పొందుతున్న శిభు(31) అనే భారతీయుడు కూడా మంగళవారం మరణించాడు. గత వారం నుంచి దుబాయిలో చికిత్స పొందుతూ వచ్చిన బినిల్ అనే వ్యక్తి కూడా కరోనా కారణంగానే మృతిచెందాడు. వీరితో పాటు అబూధాబీకి చెందిన ఇసాహక్(44) అనే వ్యక్తి, మరో కేరళ వాసి కూడా ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లో  గల్ఫ్ దేశాల్లో కేరళకు చెందిన వారే 23 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలతో గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు చనిపోయిన కేరళ వాసుల సంఖ్య 125కు చేరింది.

Updated Date - 2020-05-27T02:36:21+05:30 IST