జగన్ హయాంలో 7 గంటలే : సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-10T01:46:36+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయ రంగమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పోరు బాట బహిరంగ సభలో ఆయన

జగన్ హయాంలో 7 గంటలే : సోమిరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయ రంగమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పోరు బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో 9 గంటలు నిరంతరంగా  విద్యుత్ ఇస్తే.. జగన్ హయాంలో 7 గంటలు మాత్రమే అందుతోందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే ప్రక్రియను కేంద్రం వెనక్కి తీసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు జరపడం ఆపివేయడంతో పంటదిగుబడి తగ్గిందని చెప్పారు. మునుపెన్నడూ లేని  విధంగా రైతులు క్రాప్ హాలిడేకి వెళ్తున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్య‌లో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు. 

Updated Date - 2022-07-10T01:46:36+05:30 IST