జిల్లాకు చేరిన 7 పశువుల అంబులెన్స్‌లు

ABN , First Publish Date - 2022-05-22T06:56:40+05:30 IST

పశువుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అమలు చేస్తున్నదని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ డి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు

జిల్లాకు చేరిన 7 పశువుల అంబులెన్స్‌లు

విశాఖపట్నం, మే 21: పశువుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అమలు చేస్తున్నదని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ డి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాడి రైతులకు, పశు పెంపకందారులకు పశువుల అంబులెన్స్‌ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించిన 7 పశువుల అంబులెన్సులు శుక్రవారం చేరాయని, టోల్‌ ఫ్రీ నంబరు 1962 ద్వారా వీటి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రైతులు ఈ అంబులెన్స్‌ల సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పాడి రైతులు, పశు పెంపకందారులకు వారి ఇంటి వద్దనే పశు వైద్య సేవలు అందుతాయని, అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీలో డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కం అటెండర్‌ ఉంటారని వివరించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించి పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-22T06:56:40+05:30 IST