రైస్‌మిల్లుపై 6ఏ కేసు

ABN , First Publish Date - 2022-01-22T05:07:44+05:30 IST

మానాపురం గ్రామం వద్దగల కొల్లా మల్లయ్య సన్స్‌ రైస్‌మిల్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్‌ ఎ.సులోచనరాణి శుక్రవారం విలేకర్లకు తెలిపారు.

రైస్‌మిల్లుపై 6ఏ కేసు

 దత్తిరాజేరు: మానాపురం గ్రామం వద్దగల కొల్లా మల్లయ్య సన్స్‌ రైస్‌మిల్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్‌ ఎ.సులోచనరాణి శుక్రవారం విలేకర్లకు తెలిపారు. మండలంలోని చింతలవలస గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కంది రమణ, గెద్ద ఈశ్వరమ్మలు తమ ధాన్యాన్ని మిల్లుకు తీసుకువెళ్లగా, క్వింటాకు 7 కేజీల చొప్పున తీసుకోవడంతో పాటు బస్తాకు రూ.20 చొప్పున డిమాండ్‌ చేసినట్టు జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం దేవ్‌ నాయక్‌, డీఎస్వో పాపారావు, సీఎస్‌డీటీ రవిశంకర్‌తో పాటు గ్రామ రెవెన్యూ అధికారులు మిల్లుపై విచారణ చేపట్టి, 6ఏ కేసు నమోదు చేశారు. మిల్లులో 5వేల 820 కిలోల సాధారణ బియ్యాన్ని, 2,300 క్వింటాల సీఎంఆర్‌ బియ్యాన్ని బాలాజీ ట్రైడర్స్‌ రైస్‌ మిల్లుకు తరలించినట్టు చెప్పారు. 

Updated Date - 2022-01-22T05:07:44+05:30 IST