డిస్కమ్‌లకు రూ.68,000 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-08-10T07:37:26+05:30 IST

విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌) ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ప్రకటించిన రూ.90,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే రూ.68,000 కోట్ల రుణాలు విడుదలయ్యాయి...

డిస్కమ్‌లకు రూ.68,000 కోట్లు విడుదల

  • మొదటి విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు రుణాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 9: విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌) ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ప్రకటించిన రూ.90,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే రూ.68,000 కోట్ల రుణాలు విడుదలయ్యాయి. ప్రభుత్వరంగంలోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలైన ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) ఈ రుణాలను మంజూరు చేశాయి. డిస్కమ్‌లకు ఆర్థిక ప్యాకేజీలో భాగంగా జూలై 31 వరకు రూ.30,000 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్‌ఈసీ ఇటీవలే వెల్లడించింది. గత మే నెలలో డిస్కమ్‌ల కోసం రూ.90,000 కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు రుణాలను విడుదల చేసినట్టు సమాచారం.  


Updated Date - 2020-08-10T07:37:26+05:30 IST