వాడపల్లి వెంకన్నకు రూ.65 లక్షలు విలువైన బంగారు కిరీటం సమర్పణ

ABN , First Publish Date - 2022-05-27T06:08:29+05:30 IST

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు రూ.65 లక్షలు విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించాడు. గురువారం దాత కుటుంబీకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వాడపల్లి వెంకన్నకు రూ.65 లక్షలు విలువైన బంగారు కిరీటం సమర్పణ
బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పిస్తున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, దాత

ఆత్రేయపురం, మే 26: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు రూ.65 లక్షలు విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించాడు. గురువారం దాత కుటుంబీకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారం, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా శ్రీవారికి సమర్పించారు. వేదపండితులు, అర్చకులు బంగారు కిరీటానికి సంప్రోక్షణ పూజలు జరిపి స్వామివారికి అలంకరించారు. దాత కుటుంబీలకు వేదాశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T06:08:29+05:30 IST