లోక్ అదాలత్తో 654 కేసుల పరిష్కారం
ABN , First Publish Date - 2022-08-14T06:04:57+05:30 IST
జగ్గయ్యపేట కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ ఆథారిటీ నిర్వహించిన లోక్ అదాలత్లో 654 కేసులు పరిష్క రించారు.
జగ్గయ్యపేట, ఆగస్టు 13: జగ్గయ్యపేట కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ ఆథారిటీ నిర్వహించిన లోక్ అదాలత్లో 654 కేసులు పరిష్క రించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శోభారాణి శనివారం 654 పోలీస్ కేసులు, 78 ఎక్సైజ్ కేసులు, 6 మనోవర్తి కేసులు, 3 చెక్బౌన్స్ కేసులు, 9 బ్యాంకు పీఎల్సీ కేసులను పరిష్కరించారు. బార్ అధ్యక్షుడు యర్రమాసు ధనుంజయుడు, రాయపుడి శ్రీనివాసరావు, డి.సంతోష్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
మైలవరం :మైలవరంలో 320 కేసులు పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిని షేక్ షిరీన్ తెలిపారు.